హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటి చిల్లరదొంగలా పారిపోయి వచ్చాడు: కిషన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ సందర్భంగా తెలుగు ప్రముఖుల విగ్రహాల విధ్వంసంపై తమ పార్టీపై విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన విమర్శలను భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తోసిపుచ్చారు. ఈ విమర్శలతో లగడపాటికి ఉన్న నిక్ నేమ్ జగడపాటి అని రుజువు చేసుకున్నారని ఆయన విమర్శించారు.

విగ్రహాల విధ్వంసంలో లగడపాటి ఓ రాజకీయ అజ్ఞాని అని, లగడపాటికి తమపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం విజయవాడలో దీక్షలు చేపట్టి చిల్లరదొంగలా హైదరాబాద్‌కు పారిపోయి వచ్చారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విగ్రహాల విధ్వంసంపై తమపై ఆరోపణలు చేసే ముందు లగడపాటి జరిగిన వాస్తవాలను తెలుసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. లేకుంటే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విగ్రహాల విధ్వంసం వెనుక తమ పార్టీ కార్యకర్తల హస్తం లేదని ఆయన స్పష్టం చేశారు.

అవసరమైతే లగడపాటి రాజగోపాల్ డిటెక్టివ్ ఏజెన్సీతో విగ్రహాల విధ్వంసంపై దర్యాప్తు చేయించుకోవచ్చునని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్ ప్రకటనలకు, విమర్సలకు, వ్యాఖ్యలకు తమ పార్టీ భయపడబోదని ఆయన అన్నారు. తమ పార్టీ లడగపాటి రాజగోపాల్ వంటివారిని ఎంతో మందిని చూసిందని ఆయన అన్నారు.

English summary
BJP state president G Kishan Reddy retaliated Congress MP Lagadapati Rajagopal comments on distruction of Tank bund statues during Million march. He clarified that his party had no role in distruction of statues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X