ఒడిషా రైలు ప్రమాదంలో ఆంధ్రకు చెందిన ఐఐటి విద్యార్థుల మృతి

తేజస్వి పట్టాలు దాటుతుండగా రైలు వస్తున్న విషయాన్ని గుర్తించి దినేష్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో దినేష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. వారు మృతి చెందిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఐఐటి కాంపౌండ్ నుంచి వసతి గృహానికి బస్సులు ఉన్నప్పటికీ ముందుగా వెళ్లాలనే ఉద్దేశంతో వారు కాలినడకన బయలుదేరారని సంస్థ అధికారులు చెప్పారు. ఈ విద్యార్థుల మరణంతో ఐఐటిలో విషాద వాతావరణం అలుముకుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!