హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాసలో ముసలం: కెసిఆర్ చేతికి ఎమ్మెల్యే రాజీనామా లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో ఎమ్మెల్సీ ఎన్నికల ముసలం పుట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు తెరాస శాసనసభ్యులు క్రాస్ వోటింగుకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చిక్కుల్లో పడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. క్రాస్ వోటింగుకు పాల్పడిన శాసనభ్యులను కూడా గుర్తించారు. విద్యాసాగర రావు, కావేటి సమ్మయ్య, ఏనుగు రవీందర్ రెడ్డి క్రాస్ వోటింగుకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోరుట్ల శాసనసభ్యుడు విద్యాసాగర రావు రాజీనామా చేశారు.

తన రాజీనామా లేఖను విద్యాసాగర రావు పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు సమర్పించారు. తనపై ఆరోపణలు రావడం దురదృష్ణకరమని, తాను క్రాస్ వోటింగుకు పాల్పడలేదని విద్యాసాగర రావు అంటున్నారు. క్రాస్ వోటింగుకు పాల్పడినట్లు రుజువైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో క్రాస్ వోటింగు ఆరోపణలు పార్టీని తీవ్రంగా కలచివేస్తున్నాయి.

తాను నేరం చేసినప్పుడు రుజువైతే తన రాజీనామాను ఆమోదింపజేయాలని విద్యాసాగర రావు కెసిఆర్‌ను కోరారు. కెసిఆర్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. క్రాస్ వోటింగ్ ఆరోపణలపై తెరాస పోలిట్‌బ్యూరో శనివారం సాయంత్రం సమావేశమైంది. కెసిఆర్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన నివాసంలోనే సమావేశం ఏర్పాటైంది. మరో శాసనసభ్యుడు ఏనుగు రవీందర్ రెడ్డి కూడా తన రాజీనామా లేఖతో సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది.

English summary
TRS president K Chandrasekhar Rao is in trouble with the cross voting allegations against three party MLAs in MLC election. In this juncture TRS MLA Vidyasagar Rao submitted his resignation letter to KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X