హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూపిఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలి: బిజెపి నేత వెంకయ్యనాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu
హైదరాబాద్: ప్రభుత్వం ఓటింగ్ విధానంలో ఓపెన్ బ్యాలెట్ సిస్టంను ప్రవేశ పెట్టాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు శనివారం డిమాండ్ చేశారు. వోటుకు నోటు ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించాలని అన్నారు. ఓపెన్ బ్యాలెట్ సిస్టం ద్వారా పార్టీ అభ్యర్థుల వైఖరి బహిర్గతం అవుతుందన్నారు. ఒక పార్టీనుండి గెలిచి మరో పార్టీకి ఓటు వేయడం సరికాదన్నారు. అలాంటి వాటిని రూపుమాపాలంటే ఓపెన్ బ్యాలెట్ సిస్టమే సరియైన విధానం అన్నారు.

యుపిఏ-1 ప్రభుత్వం 2008 ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎంపీలకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిందన్నారు. ఓటుకు నోటుపై పార్లమెంటులో పోరాడుతామని చెప్పారు. ఎంపీల కొనుగోలు అంశాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళతామని చెప్పారు. ఓ కేంద్ర మంత్రి 14వ లోక్‌సభలో జరిగిన విషయాన్ని 15వ లోక్‌సభలో చర్చించకూడదని చెప్పడం విడ్డూరమన్నారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం గద్దె దిగాల్సిందే అన్నారు.

వికీలీక్స్ వ్యవహారం బయటపడిన తర్వాత కూడా యూపిఏ కొనసాగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదన్నారు. అందరికీ తెలిసిన విషయాన్నే వికీలీక్స్ బయట పెట్టిందన్నారు. గత ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి 25 మంది ఎంపీలను కొనుగోలు చేసారని ఆరోపించారు.

English summary
BJP senior leader M.Venkaiah Naidu blamed today UPA government. He opposed vote for cash. He demanded to open ballot system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X