వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వెళ్లిపోవడం వల్ల కాంగ్రెసుకు నష్టం లేదు: విలాస్ రావ్ దేశ్‌ముఖ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Vilasrao Deshmukh
న్యూఢిల్లీ : మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెళ్లిపోవడం వల్ల కాంగ్రెసు పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్రమంత్రి విలాస్‌రావ్‌దేశ్‌ముఖ్‌ అన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ ప్రాంత సీనియర్‌ నేత వి. హనుమంత రావు నివాసంలో శనివారం విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సమస్యకు కేంద్రం త్వరలోనే పరిష్కారం చూపిస్తుందన్నారు. ఈ విందుకు లోక్‌సభ సభ్యుడు సర్వే సత్యనారాయణ, రాష్ట్రమంత్రి జానారెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్‌నేతలు పాల్గొన్నారు.

తెలంగాణ కోసం మద్దతు కూడగట్టడంలో భాగంగా హనుమంతరావు ఈ విందు సమావేశం ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణ కోసం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసేందుకు తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసమే మంత్రి జానా రెడ్డి ఢిల్లీ వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
Union Minister Vilasrao Deshmukh said that YS Jagan exit will not affect Congress party. He said that Government will take decision on Telangana soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X