వీలీనంపై కెసిఆర్ ఖండన: చిన్న పార్టీతో కలవమన్న విజయశాంతి
వీలీనంపై పార్టీలో ఎప్పుడూ చర్చించలేదని టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ అన్నారు. అయితే పార్టీకన్నా తమకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని చెప్పారు. విలీనం ప్రసక్తే లేదని మరో ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ ప్రజల కోసం పని చేస్తుందన్నారు. వార్తల్లో వాస్తవం లేదన్నారు. కాంగ్రెసు తీరు చూస్తుంటే తెలంగాణ ఇచ్చేలా లేదని మెదక్ ఎంపీ విజయశాంతి అన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ పెద్ద పార్టీ అన్నారు. ఎక్కడైనా పెద్ద పార్టీ వెళ్లి చిన్న పార్టీలో కలుస్తుందా అని ప్రశ్నించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వీలినంపై తమకు సంబంధం లేదని చెప్పారు. విలీనంతో బిజెపికి సంబంధం లేదన్నారు. కానీ తమకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని చెప్పారు. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం బిజెపి తెలంగాణకు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తానని చెబుతుంటే కాంగ్రెసు పార్టీ నాన్చుడూ ధోరణి ప్రదర్శిస్తోందన్నారు.