రాష్ట్రం వస్తే సమస్యలు తీరవు: దీక్ష విరమణ సమయంలో రాఘవులు
కాని అది సరికాదన్నారు. రాజకీయంగా ఎవరి ఎజెండా వారికి ఉందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడే వారు దానికోసం, సమైక్యాంధ్ర కోసం పోరాడే వారు అందుకోసం పోరాడుకోవచ్చునని చెప్పారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారు కూడా చేయవచ్చునని సూచించారు. అంతకుముందు మంత్రులు పసుపులేటి బాలరాజు, పితాని సత్యనారాయణలను ప్రభుత్వం రాఘవులుతో చర్చకు పంపించింది. మంత్రుల చర్చలు ఫలించాయి. తాను దీక్షను విరమిస్తానని చెప్పారు. అయితే సాయంత్రం ఇందిరాపార్క్ వద్ద జరిగే భారీ బహిరంగసభలో దీక్షను విరమిస్తానని చెప్పారు. మహాత్మాగాంధీ హాస్పిటల్లో మంత్రులు చర్చలు జరిపారు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం ప్రభుత్వానికి పట్టడం లేదని, వారి సంక్షేమంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ 50 డిమాండ్లు ఆయన ప్రభుత్వం ముందు ఉంచి గత ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఇందిరాపార్కు వద్ద ఆరు రోజుల క్రితం దీక్షను ప్రారంభించారు. అయితే ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గాంధీకి తరలించారు.