జగన్ను జైల్లో పెట్టొచ్చు, రాష్ట్రాన్ని అమ్ముకున్నాడు: డిఎల్
అయితే జెఎల్పీ కంటే సిబిఐ విచారణతోనే నిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. స్థానిక శాసన మండలి ఎన్నికలలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీని ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ వర్గం నేతలు అవినీతి సొమ్ముతో ఓటర్లను కొనుగోలు చేశారన్నారు. కాంగ్రెసు, టిడిపి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ లేదన్నారు. జగన్ - టిడిపి మధ్యే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాలో టిడిపి గెలవడమే ఇందుకు మంచి నిదర్శనమన్నారు.
డబ్బుతో ఓటర్లను కొనడం శోచనీయమన్నారు. ఈ ఎన్నికలలో ఓటమికి ఎవరూ నైతికంగా బాధ్యత వహించాల్సిన అవసరం లేదన్నారు. డబ్బుతో ఓటర్లను కొన్నప్పటికీ కాంగ్రెసు పార్టీ కొద్ది తేడాతోనే ఓడిందన్నారు. కాంగ్రెసు పార్టీకి ఓటు వేసి అభ్యర్థులను గెలిపించిన జెడ్పీటీసులు, ఎంపీటీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.