కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బొత్స: ముఖ్యమంత్రికి అధిష్టానం క్లాస్
అయితే అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి కంటే ముందే బొత్స సిఎం కిరణ్తో కలిశారు. తాను అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని బహిరంగంగానే చెప్పినట్టుగా తెలుస్తోంది. సిఎం వ్యవహార శైలిపై కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. టిడిపితో అవగాహనపై అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. టిడిపితో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో మరింత ఇబ్బందికర పరిస్థితులు తెచ్చారని సిఎంతో అన్నట్టుగా తెలుస్తోంది.
టిడిపితో పొత్తు వల్ల కాంగ్రెసు కార్యకర్తలు నైతికంగా దెబ్బతిన్నారనే బొత్స అధిష్టానానికి చెప్పారని తెలుస్తోంది. ఓటమిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఓటమికన్నా మ్యాచ్ ఫిక్సిందే బాధిస్తుందని అన్నట్టు సమాచారం. అయితే సిఎం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాతో 10 జన్పథ్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆస్కార్ ఫెర్నాండేజ్, అహ్మద్ పటేల్ పాల్గొన్నారు.