వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను కొట్టబోయి దెబ్బతిన్నాం: సిఎంపై మంత్రులు ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టబోయి మనం దెబ్బతిన్నామని పలువురు మంత్రులు అధిష్టానం వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య జరిగిన రహస్య ఒప్పందమే కాంగ్రెసు కొంప ముంచిందని వారు అధిష్టానానికి గురువారం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. రహస్య ఒప్పందం వల్ల టిడిపి, జగన్ వర్గం లాభపడగా కాంగ్రెసు మాత్రం దెబ్బతిన్నదని వారు చెప్పారు.

జగన్‌తో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కూడా సమాన ప్రత్యర్థిగా భావించాలని వారు కోరారు. టిడిపితో కాంగ్రెసు అవగాహన పెట్టుకోవడంపై మంత్రులు ప్రశ్నించారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు చేయడం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెసులో పెట్టిన చిచ్చుకు నిదర్శనం. జగన్‌ను ఎదుర్కోవడానికి ప్రతిపక్షంతో కలిసి పని చేయడం సరికాదని వారు అధిష్టానానికి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి చీఫ్ ట్రిక్స్ వల్ల పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలు గందరగోళంలో పడే అవకాశముందని వారు చెప్పినట్టుగా తెలుస్తోంది.

English summary
Ministers complaint against CM Kiran Kumar Reddy today to High Command. They accused TDP and Congress secret strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X