జగన్ను కొట్టబోయి దెబ్బతిన్నాం: సిఎంపై మంత్రులు ఫిర్యాదు

జగన్తో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కూడా సమాన ప్రత్యర్థిగా భావించాలని వారు కోరారు. టిడిపితో కాంగ్రెసు అవగాహన పెట్టుకోవడంపై మంత్రులు ప్రశ్నించారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు చేయడం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెసులో పెట్టిన చిచ్చుకు నిదర్శనం. జగన్ను ఎదుర్కోవడానికి ప్రతిపక్షంతో కలిసి పని చేయడం సరికాదని వారు అధిష్టానానికి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి చీఫ్ ట్రిక్స్ వల్ల పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలు గందరగోళంలో పడే అవకాశముందని వారు చెప్పినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications