అక్రమాస్తులపై వైయస్ జగన్కు హైకోర్టు నోటీసులు

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు జగన్ ప్రజల ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని కంపెనీలకు ధారాదత్తం చేశాయని తద్వారా రూ.వందల కోట్ల పెట్టుబడులు తమ సంస్థల్లో పెట్టించుకున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. సెజ్, మైనింగ్ లీజు, ఇతర ప్రాజెక్టులు ఇష్టారాజ్యంగా కేటాయించారన్నారు. నష్టం ప్రకటించిన జగతి పబ్లికేషన్స్ కంపెనీలో రూ.10 ముఖ విలువగల షేరుకు రూ.350 ప్రీమియంతో పెట్టుబడి పెట్టించారని ఆరోపించారు. ఈ అభియోగాలు రుజువైతే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకుండా డిబార్ చేసేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరారు.












Click it and Unblock the Notifications