కాంగ్రెసుతో విలీనంపై తెలంగాణ ప్రజలదే నిర్ణయం: కెసిఆర్
రెండు కళ్ల సిద్ధాంతం అంటూ చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారన్నారు. కొందరు దింపుడు కల్లం ఆశతో టిఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. టిఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే కుట్రతో కూడిన విలీన ప్రచారాన్ని ముందుకు తీసుకు వచ్చారన్నారు. బాబు ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణను అడ్డుకోలేరన్నారు. ఉప ఎన్నికలకు ముందు బాబు బాబ్లీ డ్రామా అడినప్పటికీ ఫలితం ఇవ్వలేదన్నారు. వందలాదిమంది జీవితాలను బలిపెట్టి నిర్మించుకున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్కు వచ్చి మరక అంటించుకుందన్నారు. తెలంగాణను అడ్డుకునే కుట్రలో శ్రీకృష్ణ కూడా భాగస్వామి అయ్యారని ధ్వజమెత్తారు. 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయాలంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు.
తెలంగాణలో పుట్టిన సీమాంధ్రులంతా ఇక్కడివారే అన్నారు. అలాగే సీమాంధ్ర నుంచి వలసవచ్చి ఇక్కడ స్థిరపడినవారిని తమ సోదరుల్లాగే భావిస్తున్నామన్నారు. వారితో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణ పక్కా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కీలక దశలో ఉందని అన్నారు. తెలంగాణ ఏర్పడితే చేయబోయే కార్యక్రమాలను కూడా కెసిఆర్ ప్రస్తుతించారు. కాగా టిఆర్ఎస్లో చేరిన పోచారంను కూడా పొగడ్తలతో ముంచెత్తారు.