వైయస్ జగన్పై ముఖ్యమంత్రి పేషీలో కుట్ర: అంబటి రాంబాబు

అనంతపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాంగ్రెసు సహకరిస్తే, కడప జిల్లాలో కాంగ్రెసుకు తెలుగుదేశం పార్టీ సహకరించడానికి ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని, కడపలో వైయస్ జగన్ వర్గం అభ్యర్థిని ఓడించడానికి ఈ రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్కు మైదుకూరు శాసనసభా నియోజకవర్గంలో మెజారిటీ వస్తే మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేస్తారా అని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణలను ఆయన విషపు పురుగులుగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications