వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటమిపై అధిష్టానానికి జెసి వివరణ, రఘువీరాపై ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
న్యూఢిల్లీ: మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం అధిష్టానానికి మంత్రి రఘువీరారెడ్డిపై ఫిర్యాదు చేశారు. జెసి మధ్యాహ్నం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో సమావేశమయ్యారు. ఆయనకు రఘువీరారెడ్డిపై ఫిర్యాదు చేశారు. అనంతరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో అనంతపురం జిల్లాలో కాంగ్రెసు అభ్యర్థి ఓటమిపై వివరణ ఇచ్చారు.

ఇటీవల జరిగిన స్థానిక శాసనమండలి ఎన్నికలలో అనంతపురం జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి వర్గం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతలో ఓటమికి జెసి దివాకర్ రెడ్డి కారణం అంటూ గురువారం అధిష్టానం వద్ద ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకోకుంటే కాంగ్రెసుకే నష్టం అని చెప్పారు. ఈ నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి అనంతపురంలో కాంగ్రెసు ఓటమికి కారణాలు, తనపై ముఖ్యమంత్రి కిరణ్ చేసిన ఫిర్యాదుకు వివరణ ఇచ్చారు.

English summary
Ex minister, MLA JC Diwakar Reddy gave a complaint to Ahmed Patel against Minister Raghuveera Reddy today. He clarified Ahmed Patel about Anantapur mlc election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X