ఓటమిపై అధిష్టానానికి జెసి వివరణ, రఘువీరాపై ఫిర్యాదు

JC Diwakar Reddy
న్యూఢిల్లీ: మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం అధిష్టానానికి మంత్రి రఘువీరారెడ్డిపై ఫిర్యాదు చేశారు. జెసి మధ్యాహ్నం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో సమావేశమయ్యారు. ఆయనకు రఘువీరారెడ్డిపై ఫిర్యాదు చేశారు. అనంతరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో అనంతపురం జిల్లాలో కాంగ్రెసు అభ్యర్థి ఓటమిపై వివరణ ఇచ్చారు.

ఇటీవల జరిగిన స్థానిక శాసనమండలి ఎన్నికలలో అనంతపురం జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి వర్గం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతలో ఓటమికి జెసి దివాకర్ రెడ్డి కారణం అంటూ గురువారం అధిష్టానం వద్ద ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకోకుంటే కాంగ్రెసుకే నష్టం అని చెప్పారు. ఈ నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి అనంతపురంలో కాంగ్రెసు ఓటమికి కారణాలు, తనపై ముఖ్యమంత్రి కిరణ్ చేసిన ఫిర్యాదుకు వివరణ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+