వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిక్కుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, గడ్కరీకి తలనొప్పి

By Pratap
|
Google Oneindia TeluguNews

Yeddyurrappa
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇది బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మళ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కర్ణాటక అసమ్మతి నేతలు గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రిని మార్చాలని వారు పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి, అసమ్మతి నాయకులకు మధ్య రాజీ కుదిర్చి మూడు నెలల క్రితమే పార్టీ అధిష్టానం సమస్యను పరిష్కరించింది. మళ్లీ అదే వివాదం తలెత్తింది.

అసమ్మతి నాయకులతో గడ్కరీ గురువారం రాత్రి కలిశారు. అయితే, ముఖ్యమంత్రి మార్చడానికి ఆయన ఇష్టపడడం లేదు. అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో బిజెపి మంచి ఫలితాలను సాధించింది. దీంతో యెడ్యూరప్పను మార్చే ఉద్దేశం ఆయనకు లేదని చెబుతున్నారు. అసమ్మతి నాయకుల వ్యూహాన్ని యెడ్యూరప్ప ఈసారి ముందుగానే గడ్కరీకి, జాతీయ నాయకులకు అందించారు.

రాష్ట్ర మంత్రులు జగదీశ్ షెట్టర్, జనార్ద్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ ఈశ్వరప్ప, మాజీ మంత్రి అరుణ్ లింబవల్లి, ఎంపి ప్రహ్లాద్ జోషీ తదితరులు పార్టీ ప్రధాన కార్యదర్సి అనంతకుమార్ నివాసంలో సమావేశమై తమ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర, జాతీయ నాయకుల తీరుపై గడ్కరీ చిరాకు పడుతున్నారు.

English summary
He BJP central leadership is worried about unrelenting dissident activities against its Karnataka chief minister B S Yeddyurrappa. Troubles in BJP government in the south continue unabated as dissident leaders landed in Delhi on Thursday to renew their bid for a regime change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X