ఆజాద్తో సమావేశానికి సీమాంధ్ర ఎంపి కావూరి సాంబశివరావు డుమ్మా

ఆజాద్ సమావేశానికి కావూరి రాకపోవడంలో ప్రత్యేకత ఏమీ లేదని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. కావూరి తమకు ఫోన్ చేశారని, తనకు హైదరాబాదులో పని ఉండడం వల్ల రాలేకపోతున్నానని చెప్పారని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. అదే విషయాన్ని కావూరి సాంబశివ రావు హైదరాబాదులో చెప్పారు. ఆజాద్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకపోవడం వెనక ప్రత్యేక కారణం ఏదీ లేదని ఆయన చెప్పారు. వ్యక్తిగత పనుల వల్లనే వెళ్లలేకపోయానని ఆయన హైదరాబాదులో చెప్పారు.












Click it and Unblock the Notifications