హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెంటిమెంటు పరంగా విభజిస్తే దేశం వెయ్యి ముక్కలు: ఎంపీ కావూరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao
హైదరాబాద్: సెంటిమెంటు పరంగా రాష్ట్రాలని విభజించాలని అనుకుంటే భారత దేశం వెయ్యి ముక్కలు అవుతుందని ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు శుక్రవారం అన్నారు. రాష్ట్ర వ్యవహారా ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యుల భేటీ రాష్ట్ర విభజన గురించి మాత్రమే కాదన్నారు. చాలా సమస్యల పైన ఈ భేటీ జరిగిందన్నారు. తాను వ్యక్తిగత పనుల వల్లనే సమావేశానికి హాజరు కాలేదని చెప్పారు. అంతేగాని మరో కారణం ఏదీ లేదన్నారు. చిన్న రాష్ట్రాలకు ఓ ప్రాతిపదిక ఉండాలని చెప్పారు.

పార్టీలో క్రమంగా విలువలు తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నేతలు విమర్శించనిది ఎవరిని అని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులను మాత్రమే తెలంగాణ నేతలు విమర్శించలేదని అన్నారు. అంతకుముందు చాలామందిని విమర్శించారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కూడా విమర్శించారన్నారు. దేశం మొత్తాన్ని సైంటిఫిక్‌గా ముక్కలు చేస్తే మాకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ నేతలు అందరినీ తప్పుపడతారన్నారు.

శ్రీకృష్ణ కమిటీ సభ్యుల బాధ్యతలు, పరిధి వారికి తెలుసన్నారు. ఒకరు చెప్పవలసిన పని లేదన్నారు. 8వ చాప్టర్‌పై తనకు ఆనందం గానీ, ఆవేదన కానీ లేవన్నారు. నోరున్న వాళ్లు సెంటిమెంటు పేరుతే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమిపై కూడా ఆయన స్పందించారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమన్నారు.

English summary
Eluru MP Kavuri Sambasiva Rao said today that India will thousand pieces if priority is sentiment. He blamed Telangana leaders for comments on Srikrishna Committee members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X