రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదు శివారులో పట్టపగలు న్యాయవాది దారుణ హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rangareddy District
హైదరాబాద్: హైదరాబాదు సమీపంలోని రంగా రెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో పట్టపగలు దారుణ హత్య జరిగింది. నలుగురు దుండగులు అశోక్ రెడ్డి అనే న్యాయవాదిపై దాడి చేసి అతన్ని వేటకొడవళ్లతో నరికి చంపారు. శనివారంనాడు జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఓ కేసు తుది విచారణలో ఉంది. ఆ కేసు కోసం అశోక్ రెడ్డి శేరిలింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చాడు. అతను ఇతర వ్యక్తులతో మాట్లాడుతుండగా దుండగులు అతనిపై దాడి చేశారు.

అశోక్ రెడ్డిని హత్య చేయడానికి నలుగురు దుండగులు కారులో వచ్చారు. వారు అశోక్ రెడ్డిపై దాడి చేసి వెంటాడి వేట కొడవళ్లతో నరికి చంపారు. భూవివాదమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. అశోక్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

English summary
A lawyer murdered near Hyderabad of Sei Lingampalli of Ranga Reddy district. The lawyer Ashok Reddy is hacked death by four unidentified persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X