మావోయిస్టు సాంబశివుడు హత్య నయీం అనుచరుల పనేనా?
అనంతరం నయీమ్ సోదరుడు అయిన అలీమ్ను సాంబశివుడు వర్గం చంపినట్లుగా తెలుస్తోంది. అందుకు ప్రతికారంగా సాంబశివుడు వర్గానికి చెందిన బెల్లి లలితను నయీమ్ వర్గం దారుణంగా హత్య చేసినట్లు అప్పుడు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇద్దరి మధ్య విభేదాలే ఇరువర్గాల హత్యలకు కారణంగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే అనంతరం సాంబశివుడు నయీమ్ను, నయీమ్ సాంబశివుడును టార్గెట్ చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే నయీమ్కు ఓ కేసులో ప్రభుత్వం అరెస్టు వారెంటు జారీ చేయడంతో ఆ తర్వాత నయీమ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా సమాచారం.
అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత ఆయన మంచాన పడ్డాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇన్నాళ్లకు మళ్లీ సాంబశివుడు హత్య వలన మళ్లీ అందరు నయీమ్ వర్గంవైపు అనుమానంగా చూస్తున్నారు. సాంబశివుడు హత్యకు భూవివాదాలు కూడా ఓ కారణంగా తెలుస్తోంది. సాంబశివుడు కుటుంబ సభ్యులు కూడా నయీమ్ పైనే అనుమానాలు వ్యక్తం చేయడంతో అనుమానం మరింత బలపడుతున్నాయి.