హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్ - పాక్ పోరు నేపథ్యంలో జోరుగా బెట్టింగ్‌లు: 60 మంది అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: భారత్ - పాకిస్తాన్ మధ్య బుధవారం మ్యాచ్ నేపథ్యంలో నగరంలో బెట్టింగులకు పాల్పడుతున్న బూకీలను, బెట్టింగుకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగులు జోరుగు జరుగుతున్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన హైదరాబాదు ప్రత్యేక పోలీసులు సుమారు 60 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి బెట్టింగుల ఆధారంగా కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్ తదితర 7 ప్రాంతాలలో పోలీసులు దాడులు చేసి వారిని అరెస్టు చేశారు.

భారత్ - పాకిస్తాన్ మధ్య పోరు అంటే ఎంత ఉత్కంఠ భరితంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. దానిని బూకీలు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. పోలీసులు బిజీ ఏరియాలో, షాపింగ్ ఏరియాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. బెట్టింగులు ఆన్‌లైన్, ఎస్సమ్మెస్‌ల ద్వారా కూడా జరుగుతున్నందువల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. బెట్టింగుల ప్రభావం కేవలం హైదరాబాదులోనే కాకుండా రాష్ట్రంలోని పలు ముఖ్య పట్టణాలలో ఉన్నందున అక్కడ కూడా పోలీసులు దృష్టి సారించారు.

English summary
Hyderabad police were arrested 60 members for betting today. Police suspected that Bookies are using SMS and Net for betting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X