వైయస్ జగన్పై అసెంబ్లీలో చంద్రబాబు దాడి: అడ్డుకున్న ఎమ్మెల్యేలు
జగన్ వర్గం శాసనసభ్యులను మీది ఏ పార్టీ అంటూ ఆయన ప్రశ్నించారు. నీతి, నిజాయితీ, నైతిక విలువలు లేని మనుషులు తన గురించి మాట్లాడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. వారికి తాను బెదిరిపోనని ఆయన అన్నారు. వారికి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో ఎంపిటిసిని 15 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. ప్రజా ధనాన్ని దోచుకునే హక్కు లేదని ఆయన అన్నారు.
ఈ సమయంలో జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ - వైయస్ జగన్కు భయపడి చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించడం సరి కాదని ఆయన అన్నారు. భూకేటాయింపులపై కమిటీ వేస్తే తమకు అభ్యంతరం లేదని ఆమె అన్నారు. అయితే, ఆ కమిటీ ఏయే అంశాలపై విచారణ చేయాలో తాము ఇది వరకే చెప్పామని ఆమె అన్నారు. జగన్ తన తండ్రి ద్వారా భూములు కేటాయింపజేసి తన సంస్థల్లోకి పెట్టుబడులను పెట్టించుకున్నారని ఆదాయం పన్ను శాఖ స్పష్టంగా చెప్పిందని, తాను చెప్పడం లేదని ఆయన అన్నారు. తనపై పత్రిక ఉందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీకు చేతనైతే రాజీనామాలు చేయాలని ఆయన జగన్ వర్గం శాసనసభ్యులు సవాల్ చేశారు. ఒక్క పార్టీ పేరున గెలిచి మరొకరిని బలపరుస్తున్నారని ఆయన అన్నారు.