వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ - భారత్ సెమీ పైనల్: పాకిస్తానీ కమెడియన్ హఠాన్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Pakistan
కరాచీ: మొహాలీలో జరిగిన పాకిస్తాన్, భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ పాకిస్తానీ హాస్యటుడి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ సెమీ ఫైనల్‌పై ఏర్పాటైన ఓ టీవీ షోలో పాల్గొన్న అతను గుండెపోటుతో మరణించినట్లు మీడియా వార్తలు తెలిపాయి. టీవీ షో సందర్భంగా 55 ఏళ్ల పాకిస్తానీ కమెడియన్ లియాఖత్ సోల్జర్ మరణించినట్లు డైలీ టైమ్స్ గురువారం తెలిపింది. స్థానిక టీవీ చానెల్ నిర్వహించిన షోలో లియాఖత్‌కు గుండె పోటు వచ్చిందని, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయారని ఆ వార్తాకథనం తెలిపింది.

లియాఖత్ 1973లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన 250కి పైగా టెలివిజన్ నాటకాల్లో నటించాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగస్థల ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. అతని తొలి సినిమా ఖైద్. అతను నటించిన తొలి నాటకం తుమ్ క్యా జనో. అతను పలు పేరడీ సినిమాల్లో నటించాడు.

మొహాలీలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ పాకిస్తాన్‌పై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచును భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కూడా తిలకించారు. వీరిద్దరు ఈ సందర్భంగా చర్చలు కూడా జరిపారు. ఫైనల్ మ్యాచులో భారత్ శనివారంనాడు శ్రీలంక క్రికెట్ జట్టును ఎదుర్కుంటుంది.

English summary
A Pakistani comedian died while participating in a TV show organized for the Pakistan-India World Cup semifinal match that India went on to win, a media report said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X