కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీతిలేని ఎమ్మెల్యేలతో జగన్‌ను ఎదుర్కొనే శక్తి లేదు: వీరశివా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని కడప జిల్లా కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు వీరశివారెడ్డి గురువారం ధ్వజమెత్తారు. జగన్‌ను వెంట నడుస్తున్న వారు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ కాంగ్రెసు పార్టీతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసిన విధంగా జగన్ వెంట వెళుతున్న శాసనసభ్యులు కూడా రాజీనామా చేసి పోటీకి సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు.

వారికి ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభలకు కాంగ్రెసు అభ్యర్థులను నిలబెడతామని ఆయన చెప్పారు. జగన్ వెంట వెళుతున్న శాసనసభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి గట్టిగా చెప్పామని ఆయన అన్నారు. జగన్ వర్గం శాసనసభ్యులపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

ఆయన వెంట వెళుతున్న శాసనసభ్యులు పార్టీలోనే ఉంటే మేం జగన్‌ను ఎదుర్కోవడం కష్టం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వారిని పార్టీనుండి సస్పెండ్ చేయకుంటే జగన్‌ను ఎదుర్కొనే శక్తి మాకు ఉండదన్నారు. వారిని సస్పెండ్ చేస్తేనే ప్రచారానికి వెళతామని, తద్వారా విజయాన్ని సాధిస్తామని చెప్పారు. నీతి, నిజాయితీ ఉంటే వారు వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్నారు.

English summary
Kadapa district Congress MLA Veerashiva Reddy blamed Ex MP YS Jaganmohan Reddy camp MLAs. He demanded for Jagan camp MLAs resignation. He questioned their attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X