వైయస్ జగన్ లక్ష్యంగా పిజెఆర్ తనయుడు ఎమ్మెల్యే విష్ణు
జగన్కు కాంగ్రెసు శాసనసభ్యులతో పాటు పలువురు మంత్రుల మద్దతు కూడా ఉందని పివిఆర్ సోనియాకు రాసిన బహిరంగ లేఖలో చెప్పారు. జగన్ వెంట వెళుతున్న మంత్రులపై కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వైయస్ పాలన అవినీతిమయంగా సాగిందని, సంక్షేమ పథకాల ముసుగులో దాన్నంతా మూసి పెట్టే ప్రయత్నం చేశారన్నారు. వైయస్ మరణానంతరం జగన్ను ముఖ్యమంత్రిని చేయాలంటూ సాగిన సంతకాల సేకరణలో తాను పాల్గొనలేదని, సంతకం కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా జగన్ ఏనాడూ పరిగణించలేదన్నారు. ఆయనపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేశారన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో కొందరు పనిగట్టుకొని జగన్తో ప్రచారం చేయించారని ఆయతే ఫలితం మాత్రం కనిపించలేదన్నారు. తన నియోజకవర్గంలో మాత్రం జగన్ పర్యటించకుండా నిరోధించానని చెప్పారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలలో బాహాటంగానే జగన్ వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెసు ఓటమికి కారణమయ్యారని, అలాంటి వారితో పాటు ఆయనకు అనుకూలంగా వ్యవహరించే మంత్రులపై చర్యలు తీసుకోవాలని పివిఆర్ కోరారు. జగన్ వర్గం నేతలపై సిఎం కిరణ్ కఠినంగానే ఉన్నారని అయితే మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు.