హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌ను ధీటుగా ఎదుర్కొంటాం: ఎమ్మెల్యే వీరశివా రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలలో ధీటుగా ఎదుర్కొంటామని కడప జిల్లాకు చెందిన కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు వీరశివారెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కడపలో, పులివెందులలో కాంగ్రెసు పార్టీదే విజయం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌ను కాంగ్రెసు ఖచ్చితంగా ఎదుర్కొంటుందన్నారు.

ఉప ఎన్నికలలో పోటీకి అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థినే తామంతా బలపరుస్తామని చెప్పారు. అధిష్టానం ఎంపిక చేసిన వ్యక్తి బరిలోకి దిగుతారని చెప్పారు. అధిష్టానం సూచించిన వ్యక్తికి తామంతా బాసటగా నిలబడి గెలుపుకు కృషి చేస్తామని చెప్పారు. జగన్‌పై పోటీకి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సరియైన వ్యక్తి అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే డిఎల్‌పై తాను ఒత్తిడి తీసుకు వస్తున్నట్టుగా చెప్పారు. తన పేరును కూడా కొందరు ప్రతిపాదిస్తున్నారని, అయితే అధిష్టానం ఎవరిని సూచిస్తే వారు బరిలోకి దిగుతారని చెప్పారు.

English summary
Congress MLA Veerashiva Reddy said that Congress will give strong fight to Ex MP YS Jaganmohan Reddy. He suggested minister DL Ravindra Reddy from Kadapa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X