అవినీతిపరులు జైలుకు వెళ్లారా, ప్రాణం ఉన్నంత వరకు పోరాటం: అన్నాహజారే
కొత్త కమిటీలో ఉండాలని లేదని, కానీ ఆ బిల్లును మాత్రం తేవాలని అన్నారు. దేశవ్యాప్తంగా తన దీక్షకు మద్దతు తెలుపుతున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదీనంలో ఉన్న సిబిఐలాంటి సంస్థ కూడా అవినీతిని తగ్గించడంలో విఫలం చెందాయని ఆరోపించారు. ఈ నెల 12నుండి జైల్ భరో కార్యక్రమానికి అన్నాహజారే దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. కాగా ఇప్పటికే ప్రభుత్వం అన్నాహజారే మూడు డిమాండ్లకు ఒప్పుకుంది. ఈరోజు సాయంత్రం కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ మరో మారు అన్నాహజారే వర్గంతో చర్చలు జరపనున్నారు.
కాగా అన్నాహజారే దీక్షకు క్రికెటర్లు, సినిమా తారలు మద్దతు ప్రకటించాలని అనుపమ్ ఖేర్ అన్నారు. శుక్రవారం అన్నాహజారే దీక్ష స్థలికి వచ్చి అనుపమ్ మద్దతు పలికారు. అవినీతినుండి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాదులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములు యూత్ ఫర్ బెట్టర్ ఇండియా ఆధ్వర్యంలో అన్నహాజరే దీక్షకు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. కాగా అన్నాకు మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి.