వైయస్ జగన్ ఎఫెక్ట్: పోటీకి వెనక్కి తగ్గిన కందుల బ్రదర్స్
జగన్పై పోటీ చేయడానికి తొలుత కందుల రాజమోహన్ రెడ్డి సిద్ధపడ్డారు. అయితే, కుమారుల నుంచి, సమీప బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. కందుల బ్రదర్స్పై వారు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి పోటీ నుంచి తప్పించారు. వైయస్ జగన్ వ్యూహమే దీని వెనక పనిచేసినట్లు చెబుతున్నారు. కడప లోకసభ నియోజకవర్గంలో జగన్కు మద్దతు ఇవ్వాలనే దృష్టితోనే కందుల బ్రదర్స్ వర్గం మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. దీంతో పోటీకి దిగవద్దని కందుల బ్రదర్స్కు నచ్చజెప్పినట్లు సమాచారం. ఈ స్థితిలో కందుల సోదరులు కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి విజయానికి పనిచేస్తారా అనేది కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు.
Comments
kandula rajamohan reddy kadapa ys jagan hyderabad కందుల రాజమోహన్ రెడ్డి కందుల శివానంద రెడ్డి కడప వైయస్ జగన్ హైదరాబాద్
English summary
Kandula brothers rejected to contest from Kadapa loksabha seat is due to YS Jagan factor. It is said that their supporters and followers appealed to Kandula brothers not to contest.
Story first published: Friday, April 8, 2011, 10:01 [IST]