చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై ధ్వజమెత్తిన చిరంజీవి, మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
చెన్నై: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కుటుంబ పాలన గురించి మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమి తరఫున ప్రచారం చేసేందుకు శుక్రవారం చెన్నై వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చంద్రబాబు కూడా ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన వారేనని, అలాంటి వ్యక్తి కరుణ కుటుంబ పాలన గురించి విమర్శించడం సరికాదని అన్నారు. తమిళనాడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని, ఇక్కడున్న పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పలు పథకాలను సాధించుకుంటున్నాయని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఎంపీల అసమర్థత కారణంగా అనేక ప్రాజెక్టులు వెనక్కి వెళ్లాయని పేర్కొన్నారు. కొంతమంది నాయకులు చేసిన అవినీతి కారణంగా పార్టీని తప్పుబట్టలేమని, అయితే ఆ వ్యక్తిపై ఆయా పార్టీలు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలతో మాట్లాడి ఇక్కడి తెలుగువారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చిరు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆవడి నియోజకవర్గం, తిరువళ్లూరు జిల్లాల్లో చిరంజీవి ప్రచారం చేశారు.

English summary
Prajarajyam party president Chiranjeevi lashed out at TDP president N Chandrababu Naidu. Chiranjeevi said that Chandrababu has not right to comment on Karunanidhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X