భద్రాద్రి రాముడికి సిఎం ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పణ
భద్రాద్రి పోలీసు చక్రబంధంలోకి వెళ్లింది. పోలీసులు భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తం 3115మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. గతంలో ఎన్నడూలేనిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ కాంతికాణాతాతా, అదనపు ఎస్పీలు గజరావ్భూపాల్, ప్రవీణ్ల ఆధ్వర్యంలో 13మంది డీఎస్పీలు భద్రతా చర్యలను చూస్తున్నారు. భద్రాచలంలోకి వచ్చే వాహనాలను పట్టణంలో సరిహద్దులలోనే క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వచ్చే వాహనాలను మరీ నిశితంగా తనిఖీ చేస్తున్నారు. ప్రముఖులు వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రత్యేక పోలీసులు, ఆర్మ్డ్రిజర్వ్ పోలీసులు వాహనాల తనిఖీలతో పాటుగా, భద్రాచలం వచ్చే రహదారులలో కల్వర్టులు, అటవీ ప్రాంతాలను అణువణువూ గాలిస్తున్నారు. భద్రాచలం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు, ప్రముఖుల వాహనాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రముఖుల వాహనాల శ్రేణి(కాన్వాయ్)తో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ''ట్రయల్స్'' నిర్వహించారు.