హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్‌పై అభిమానంతోనే వైయస్ జగన్‌తో ఉన్నా: కమలమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప జిల్లా బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మ కథ ఎట్టకేలకు కంచికి చేరింది. కాంగ్రెసు పార్టీకి ఆమె విధేయతను ప్రకటించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతోనే తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నట్లు ఆమె తెలిపారు. శుక్రవారం ఉదయం ఆమె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తాను ఏ రోజు కూడా లేనని ఆమె స్పష్టం చేశారు.

కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగానే తాను ఎన్నికల్లో గెలిచానని, కాంగ్రెసు పార్టీని తాను ఏనాడూ విమర్శించలేదని ఆమె చెప్పారు. కడప లోకసభ స్థానంలో తాను కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి విజయానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. గత నాలుగైదు రోజులు కమలమ్మ వైయస్ జగన్‌తో ఉండాలా, కాంగ్రెసులో కొనసాగాలా అనే విషయాన్ని తేల్చుకోలేకపోయారు. వైయస్ జగన్‌తో చర్చలు విఫలం కావడంతో కాంగ్రెసులోనే కొనసాగాలని నిర్ణయించుకుని ముఖ్యమంత్రిని కలిశారు.

English summary
Kadapa district Badvel MLA Kamalamma met CM Kiran Kumar Reddy and announced her loyalty to Congress party. She said that she never continued in YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X