కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గం ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు: కొండా సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని ప్రయత్నాలు చేస్తుందని అధికార కాంగ్రెసు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది మాజీ మంత్రి, వరంగల్ జిల్లా సీనియర్ శాసనసభ్యురాలు కొండా సురేఖ శుక్రవారం ధ్వజమెత్తారు. జగన్ నామినేషన్ వేసిన సందర్భంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలను బెదిరించి, భయపెట్టి జగన్ పార్టీ అయిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకి దూరం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తమకు పోరాటాలు కొత్త కాదని చెప్పారు. ప్రాణాలు పోయినా జగన్ వెంటే తాము ఉంటామని చెప్పారు.

ఉప ఎన్నికలలో కడప ప్రజలు కాంగ్రెసుకు తమ ఓటుతో ఎలాగైనా బుద్ధి చెప్పాలనే కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని పావుగా వాడుకొని గెలిచేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అందుకే వైయస్ బొమ్మను కాంగ్రెసు పెట్టుకుంటుందని అన్నారు. జగన్ పార్టీకి కామన్ సింబల్ లేక పోయినా వారి గుర్తులనే ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. కడపలో జగన్‌ను, పులివెందులలో విజయమ్మను ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని ఆమె చెప్పారు.

English summary
Ex Minister Konda Surekha blamed Congress Party today in Kadapa district. She accused that congress government is trying to defeat YS Jagan. She said Kadapa voters will learn lesson to congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X