జగన్ వర్గం ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు: కొండా సురేఖ
ఉప ఎన్నికలలో కడప ప్రజలు కాంగ్రెసుకు తమ ఓటుతో ఎలాగైనా బుద్ధి చెప్పాలనే కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని పావుగా వాడుకొని గెలిచేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అందుకే వైయస్ బొమ్మను కాంగ్రెసు పెట్టుకుంటుందని అన్నారు. జగన్ పార్టీకి కామన్ సింబల్ లేక పోయినా వారి గుర్తులనే ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. కడపలో జగన్ను, పులివెందులలో విజయమ్మను ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని ఆమె చెప్పారు.
Comments
konda surekha ys jagan congress ys rajasekhar reddy kamalamma kadapa కొండా సురేఖ వైయస్ జగన్ కాంగ్రెసు వైయస్ రాజశేఖర రెడ్డి కమలమ్మ కడప
English summary
Ex Minister Konda Surekha blamed Congress Party today in Kadapa district. She accused that congress government is trying to defeat YS Jagan. She said Kadapa voters will learn lesson to congress.
Story first published: Friday, April 15, 2011, 11:41 [IST]