అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్య సాయిబాబా ఆరోగ్యంపై పెనుకొండ కోర్టులో పిటిషన్ దాఖలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం/హైదరాబాద్: పుట్టపర్తి సత్యసాయి బాబా ఆరోగ్యంపై అనంతపురం జిల్లా పెనుకొండ కోర్టులో పిటిషన్ దాఖలైంది. సత్య సాయిబాబా ఆరోగ్యంపై నిజానిజాలు తెలియజేయాలని కోరుతూ భాస్కర్ రెడ్డి అనే న్యాయవాది శుక్రవారం ఆ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, పిటిషన్‌పై విచారణను కొర్టు శనివారానికి వాయిదా వేసింది. సత్య సాయిబాబా కొంత మంది స్వార్థపరుల చేతుల్లో బందీ అయ్యారని, ఆయన ఆరోగ్యంపై వాస్తవాలను వెల్లడించడంలేదని వార్తాకథనాలు వస్తున్న నేపథ్యంలో ఆ పిటిషన్ దాఖలైంది.

ఇదిలా వుంటే, సత్య సాయిబాబా విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తూ దళిత జనసభ శుక్రవారం హైదరాబాదులోని మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సత్య సాయిబాబాను భక్తులకు చూపించకుండా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని దళిత జనసభ ఆరోపించింది. వైద్యం పేరుతో బాబాను ఆస్పత్రిలో బందీ చేశారని వ్యాఖ్యానించింది. ట్రస్టు బోర్డు సభ్యులపై, ఆస్పత్రి అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత జనసభ కోరింది.

English summary
A petition was filed on Sathya Saibaba's health in Penukonda court of Anantapur district. Lawyer Bhaskar Reddy filed the petition and appealed to reveal facts on Baba's health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X