హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు నాగం జనార్దన్ రెడ్డి వత్తాసుపై మోత్కుపల్లి నర్సింహులు ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Mothukupally Narasimhulu
హైదరాబాద్‌: తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కున్న క్రెడిబిలిటి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి లేదని తమ పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మోత్కుపల్లి నరసింహులు మండిపడ్డారు. అత్యంత అవినీతిపరుడైన వైయస్ జగన్‌తో చంద్రబాబును పోల్చడం సరి కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నాగం జనార్దన్ రెడ్డి ప్రకటన వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడిందని ఆయన వ్యాఖ్యానించారు.

పార్టీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీలో ఓ ముఖ్య నాయకుడిగా కొనసాగుతూ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్ రాష్ట్రాన్ని కొల్లగొట్టారని, అటువంటి జగన్‌తో చంద్రబాబును పోల్చడం బాధాకరమని, అలాంటి వ్యాఖ్య చేయడం సంప్రదాయం కూడా కాదని ఆయన అన్నారు.

తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధన కోసం తాము ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని, అయితే కాంగ్రెసు శాసనసభ్యులు అందుకు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెసుతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు.

English summary
TDP Telangana MLA Mothkupalli Narasimhulu has opposed Nagam Janardhan reddy's comments on N Chandrababu Naidu. He said that It is not fair to compare YS Jagan with Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X