వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్య సాయి ట్రస్టుపై పోలీసులకు బిసి సంఘాల ఐక్య వేదిక ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Saibaba
అనంతపురం : పుట్టపర్తి సత్యసాయిబాబా ట్రస్టు సభ్యులపై సోమవారం రాష్ట్ర బీసీ సంఘాల ఐక్యవేదిక అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సత్యసాయి ముఖ్య అనుచరుడు సత్యజిత్‌తో సహా మరో ఏడుగురు ట్రస్టు సభ్యులపై సంఘం ఫిర్యాదు చేసింది. బాబాకు ప్రాణహాని ఉందని, ఆయనను తక్షణమే భక్తులకు చూపించాలని సంఘం అధ్యక్షుడు నాగరాజు ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ప్రపంచంలోని 224 దేశాలలో సత్యసాయి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, బాబాను ఇంతవరకు భ క్తులెవరికీ చూపించకుండా ఐసీయూలో ఉంచినట్లు డాక్టర్లు చెబుతున్నారని, మరి సత్యజిత్‌ను లోపలికి ఎలా అనుమతించారని నాగరాజు మీడియా ప్రతినిధులతో అన్నారు. బాబా విషయంలో, ఆస్తుల వ్యవహారంలో పెద్ద ఎత్తున గూడుపుఠాణి జరుగుతోందని నాగరాజు ఆరోపించారు. సత్యజిత్‌ను అరెస్టు చేసి, ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టి, విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

అయితే బీసీ సంఘాల నాయకులు, కార్యర్తలు పోలీస్ స్టేషన్‌కు భారీగా తరలివస్తుండడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కేవలం ఫిర్యాదు చేయడానికే వస్తున్నామని వారు పేర్కొనడంతో నాగరాజుతో సహా మరికొంతమంది నేతలను మాత్రమే స్టేషన్‌లోకి అనుమతించారు. వీరి ఫిటిషన్‌పై స్పందించిన అర్బన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) విఠల్‌రావు మాట్లాడుతూ అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి, నిజానిజాలు వెలుగులోకి తేచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. విచారణ జరిపిన తర్వాత సాక్ష్యాలు ఉంటే కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.

English summary
BC United Front complained against Sathya Sai trust to police. It complained against 7 trust memners including Sathajith.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X