కడప ఉప ఎన్నికలు మార్పునకు నాంది: వైయస్ జగన్ ప్రకటన

వైయస్సార్ స్వర్ణయుగాన్ని మనమే తెచ్చుకుందామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై కాంగ్రెసు నాయకులు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఉన్నానని, అందువల్లనే కడపకు ఉప ఎన్నిక వచ్చిందని ఆయన అన్నారు. తాను నైతిక విలువలకు కట్టుబడి ఉండకపోతే ఉప ఎన్నికలు వచ్చేవి కావని, నైతిక విలువలకు కట్టుబడే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశానని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications