హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ అవినీతిని నిరూపిస్తే తల నరుక్కుంటా: పోసాని కృష్ణ మురళి

By Pratap
|
Google Oneindia TeluguNews

Posani Krishna Murali
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ అవినీతిని నిరూపిస్తే తన నరుక్కుంటానని తెలుగు సినీ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో వైయస్ జగన్ మాత్రమే మంచివాడని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు, వైయస్సార్ కుటుంబ సభ్యులు మాత్రమే నిజాయితీపరులని ఆయన అన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నిజాయితీ లేదని, నందమూరి హరికృష్ణ వంటి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో మాత్రమే నిజాయితీ ఉందని, బతికి ఉంటే తాను ఎన్టీ రామారావుతో ఉండేవాడినని ఆయన అన్నారు.

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వ్యక్తిగతంగా మంచివాడని, అయితే జెండా, పార్టీ కార్యాలయం మూసేశారని, తాను తిట్టిన కాంగ్రెసులోనే చేరుతున్నారని, అందువల్ల చిరంజీవికి నిజాయితీ కొరవడిందని ఆయన అన్నారు. చిరంజీవిని ప్రజలు నమ్మడం లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్‌ను ప్రజలు నమ్ముతున్నారని ఆయన చెప్పారు. జగన్‌ను నమ్ముకుంటే చివరి వరకు వారి వెంట ఉంటారని ఆయన అన్నారు. జగన్‌కు విశ్వసనీయత ఉందని ఆయన అన్నారు.

English summary
Telugu film director Posani Krishna Murali has supported YSR Congress party leader YS Jagan. He siad that Chiranjeevi has lost cridibility by joining Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X