హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సినీ హీరో బాలకృష్ణ భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్‌: సినీనటుడు, తెలుగుదేశం నాయకుడు బాలకృష్ణ మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. క్యాంప్ కార్యాలయంలో వీరి ఇరువురి భేటీ జరిగింది. బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రికి సంబంధించి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా బాలకృష్ణ ఆహ్వానించినట్లు సమాచారం. కాగా, వచ్చే నెల 28వ తేదీన ప్రముఖ సాహితీవేత్త సి. నారాయణ రెడ్డికి ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్టు తరఫున ఎన్టీఆర్ సాహితీ పురస్కారాన్ని అందజేసే విషయంపై కూడా బాలకృష్ణ ముఖ్యమంత్రితో చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రముఖ కవి డాక్టర్‌ సి.నారాయణరెడ్డి ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. మే 28న రవీంద్రభారతిలో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో సినారేకు ఈ అవార్డు అందజేస్తారు. ప్రముఖ నటుడు దివంగత ఎన్టీఆర్‌ పేరుమీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ అవార్డును 1996 సంవత్సరంనుంచిఅందజేస్తోంది. మొదట ఈ అవార్డుని అక్కినేని నాగేశ్వరరావు అందుకున్నారు. ఈ అవార్డు కింద 5 లక్షల రూపాయల నగదు, మొమెంటో అందజేస్తారు.

English summary
Hero and TDP leader N Balakrishna met CM Kiran Kumar Reddy at later's camp office. It is said that Balakrishna invited CM for Basavatarakam hospital programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X