అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్య సాయిబాబా ఆరోగ్యంపై చివరి ప్రయత్నాలు: రఘువీరా రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
హైదరాబాద్: పుట్టపర్తి సత్య సాయిబాబా ఆరోగ్యం విషయంలో వైద్యులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. సత్య సాయిబాబా చాలా అవయవాలు బాగా దెబ్బ తిన్నాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. సత్య సాయిబాబా ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నదని ఆయన అన్నారు. సత్య సాయిబాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, నిఘా ఐడి గురువారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు.

కాగా, మంత్రి గీతా రెడ్డి సత్య సాయిబాబా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. పుట్టపర్తిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో 144వ సెక్షన్ విధించారు. ఇదిలా వుంటే, సత్య సాయి ట్రస్టు సభ్యుల కీలక సమావేశం గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు జరుగుతుంది. సత్య సాయిబాబా ఆరోగ్యం క్షీణించిందని గురువారం ఉదయమే డాక్టర్ సఫాయా ప్రకటించారు. పుట్టపర్తిలోకి పోలీసులు బలగాలను పెద్ద యెత్తున దించుతున్నారు.

English summary
Minister Raghuveera Reddy said that doctors are putting final efforts regarding Sathya Saibaba's health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X