వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచం గొప్ప సేవకుడిని కోల్పోయింది: హోంమంత్రి సబితారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్‌: ప్రపంచం ఓ గొప్ప సేవకుడిని కోల్పోయిందని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మరణ వార్త తెలిసిన సబిత ఉలిక్కిపడ్డారు. బాబా జీవితం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి వ్యక్తి ఆయన బాటలో నడవాలని ఆమె సూచించారు. విదేశాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిజిపిని ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పారు. కాగా హోంమంత్రి సోమవారం పుట్టపర్తికి వెళ్లనున్నారు.

కాగా సత్యసాయి మృతిపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్, ఏఐడిఎంకె అధ్యక్షురాలు జయలలిత, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండారు దత్తాత్రేయ తదితరులు తమ సంతాపాన్ని వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్ అంతకుముందు బాబా పార్థివ శరీరాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

English summary
Home minister Sabitha Reddy said today that world lost a great charity person. She suggested all the people that follow Sai Baba.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X