వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబా మరణంతో తల్లడిల్లిన సచిన్: హోటల్ గదిలో డోండ్ డిస్టర్బ్ బోర్డు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba-Sachin Tendulkar
హైదరాబాద్‌: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మరణం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌ను తీవ్రంగా కలచివేసింది. బాబా మరణవార్త తెలియగానే సచిన్ ఒకింత ఆందోళనకు, ఉద్వేగానికి లోనయ్యాడంట. దక్కన్ ఛార్జర్స్‌తో మ్యాచ్ కోసం శనివారం హైదరాబాద్ వచ్చిన సచిన్ టెండుల్కర్ బాబా మరణ వార్త తెలియగానే హోటల్ గదిలోని తన గది ముందు డోంట్ డిస్టర్బ్ మి అనే బోర్డు పెట్టినట్లుగా తెలుస్తోంది. సహచరులు గానీ, మరెవరు కానీ తనను డిస్టర్బ్ చేయవద్దని కోరుతూ బోర్డు పెట్టాడంట. బాబా మరణంతో సచిన్ తీవ్రంగా తల్లడిల్లిపోయాడంట.

అయితే సచిన్ పరిస్థితి చూసిన సహచరులు అసలు సచిన్ ఆడటానికి వస్తాడా లేడా అనే టెన్షన్‌కు గురి అయ్యారని సమాచారం. మిగిలన ఆటగాళ్లు క్రికెట్ స్టేడియంకు బయలు దేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కూడా సచిన్ రాలేదంట. దీంతో మిగతా ఆటగాళ్లు తీవ్ర ఆందోళన చెందారని సమాచారం. అయితే బస్సు బయలుదేరుతున్న క్షణాన సచిన్ వచ్చి బస్సులోకి ఎక్కాడు. అయితే ఎప్పుడు చిరు నవ్వుతో కనిపించే సచిన్ తీవ్ర నిస్పృహతో కనిపించారు. తాను ఒక్కడే వచ్చి బస్సు ఎక్కి ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయాడు. అయితే సచిన్ ఆడటానికి వస్తాడో లేదో అని ఆందోళన చెందిన ఆటగాళ్లు సచిన్ రావడంపట్ల సంతోషంగా ఉన్న సచిన్ పరిస్థితి చూసి మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారంట.

English summary
Master blaster Sachin Tendulkar disturbed very much with Bhagvan Sri Sathya Sai assasination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X