అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమాధి వద్ద సత్య సాయిబాబా విగ్రహంపై ట్రస్టుదే నిర్ణయం: కలెక్టర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: సత్య సాయిబాబా సమాధి వద్ద విగ్రహం ప్రతిష్ఠాపనపై నిర్ణయం ట్రస్టుదేనని అనంతపురం జిల్లా కలెక్టర్ జనార్దన్ రెడ్డి చెప్పారు. సత్య సాయిబాబా భౌతిక కాయాన్ని ఎలా సమాధి చేయాలనే విషయంపై ట్రస్టు సభ్యులు, కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకుంటారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తామని ఆయన చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.

సత్య సాయిబాబా భౌతిక కాయాన్ని భక్తుల సందర్శనార్థం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్‌లో ఉంచారు. యజుర్ మందిర్‌కు అతి సమీపంలో భౌతిక కాయాన్ని బుధవారం సమాధి చేస్తారు. బుధవారం ఏ సమయంలో భౌతిక కాయాన్ని సమాధి చేస్తారనేది తర్వాత ప్రకటిస్తారు. బాబా అంత్యక్రియలకు దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దేశ, విదేశీ ప్రముఖులు పలువురు పుట్టపర్తి వచ్చే అవకాశాలున్నాయి.

English summary
Anantapur district collector Janardhan Reddy said that trust will take decision on installation of Sathya Sai baba's statue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X