శవపేటికకు మేం ఆర్డర్డివ్వలేదు, ఓ భక్తుడు ఆర్డరిచ్చాడు: ట్రస్టు
సత్య సాయి బాబా ఆరోగ్య స్థితిపై రోజుకు రెండు సార్లు వైద్యులు బులిటెన్ విడుదల చేశారని, బాబా ఆరోగ్యంపై ఊహించుకుంటే తాము ఏమీ చేయలేమని ఆయన అన్నారు. సత్యజిత్ సత్యసాయి విద్యాసంస్థల మాజీ విద్యార్థిని అని ఆయన చెప్పారు. సత్యజిత్ను తన వ్యక్తిగత సహాయకుడిగా సత్య సాయి బాబానే ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు. ఐసియులోకి సత్య సాయిబాబా కుటుంబ సభ్యులను అనుమతించినట్లు ట్రస్టు సభ్యుడు, బాబా సోదరుడి కుమారుడు రత్నాకర్ చెప్పారు. తాను ఐసియులోనే ఉన్నానని, తమ కుటుంబ సభ్యులను ఏదో సమయంలో బాబాను చూడడానికి అనుమతి ఇచ్చామని ఆయన చెప్పారు. బాబా ఆస్పత్రిలో చేరడానికి ముందు బాబాకు అందించిన వైద్యంపై తాము చెప్పలేమని, అప్పుడు బాబానే తన ఇష్టప్రకారం వైద్యులను ఎంపిక చేసుకున్నారని శ్రీనివాసన్ చెప్పారు.
ఏం చేయాలనే విషయంపై తాము సత్య సాయిబాబాకు చెప్పేవారం కాదని, సత్యసాయి తన ఇష్టప్రకారం వ్యవహరించేవారమని, తాము బాబాను అనుసరించే భక్తులం మాత్రమేనని ఆయన చెప్పారు. ట్రస్టు ఆభరణాలను, బంగారాన్ని తరలించలేదని ఆయన చెప్పారు. తన ఆరోగ్యంపై తన వైద్యులను సంప్రదించి సత్య సాయి స్వయంగా నిర్ణయాలు తీసుకునేవారని ఆయన చెప్పారు. సమాధి వద్ద పాటించాల్సిన నిబంధనలపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.