విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గొంతు కోసి మహిళను హత్య చేసి పిల్లలను కిడ్నాప్ చేసిన దండగులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Krishna District
విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరంలో గురువారం అర్థరాత్రి అరుణ అనే మహిళను హత్యచేసి దుండగులు ఆమె ఇద్దరు కూతుళ్లను అపహరించారు. ఇంట్లో ఉన్న అరుణను గొంతుకోసి హత్య చేసిన దుండగులు ఆ తర్వాత ఆమె ఇద్దరు కూతుళ్లు కావ్య, శ్రావ్యను అపహరించినట్లు అనుమానిస్తున్నారు. అరుణ భర్త ఓ సంస్థలో నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అరుణ భర్త ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అరుణ హత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, భార్యాభర్తలు గొడవ పడ్డారా అనే విషయాలపై దృష్టి పెట్టారు. ప్రభాకర్ పాత్రనే పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
A woman was murdered in Krishna district and her two children were kidnapped. Police are questioning her husband Prabhakar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X