వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యాయం కోసం భర్త ఇంటి ముందు ఆందోళన: రెండో భార్యతో భర్త పరార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakaptnam
విశాఖపట్నం: తనకు న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లాలో ఓ మహిళ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఆ మహిళ గురువారం నుండి ఆందోళనకు దిగింది. విశాఖపట్నం జిల్లాలోని గోపాలపట్నం గ్రామానికి చెందిన రమాదేవికి పదేళ్ల క్రితం చంద్రశేఖరరాజుతో వివాహం అయింది. కొన్నాళ్లకు ప్రశాంత్ అనే అబ్బాయి పుట్టాడు. ప్రశాంత్‌కు బ్రెయిన్ ట్యూమర్ ఉంది. అనంతరం భార్యను చంద్రశేఖరరాజు ఇంటి నుండి గెంటి వేశాడు. భర్త గెంటి వేయడంతో తన కొడుకు బ్రెయిన్ ట్యూమర్‌ చికిత్స కోసం తన పుట్టింటి వారితో కలిసి చికిత్స చేయించింది. కొడుకు వ్యాధి తగ్గడానికి చెన్నైలో చికిత్స చేయించింది. అయితే లక్షలు ఖర్చు చేసినప్పటికీ ప్రశాంత్‌ను బ్రతికించుకోలేక పోయింది. అయితే చనిపోయిన కొడుకును చూడటానికి భర్త రాలేదు.

అంతేకాకుండా తన భర్త మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నారనే విషయం రమాదేవి దృష్టికి వచ్చింది. దీంతో రమాదేవి తన కొడుకు ప్రశాంత్ మృతదేహంతో భర్త చంద్రశేఖరరాజు ఇంటి ముందు గురువారం ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తానని చెప్పింది. అయితే రమాదేవి ఇంటి వద్దకు ఆందోళన చేయడానికి వస్తుందనే విషయం తెలుసుకున్న భర్త తన రెండో భార్యతో సహా పరారయినట్లుగా తెలుస్తోంది. తానకు పెళ్లి అయిన నాటి నుండి అత్తింటి వారిలో కష్టాలు ఉన్నాయని రమాదేవి చెబుతోంది. తమ తల్లిదండ్రులు ఇచ్చిన కట్నమే కాకుండా అదనపు కట్నం తెమ్మని వారు చిత్ర హింసలు పెట్టారని చెబుతోంది.

English summary
A wife continuing her agitation at husband's residence for justice. She take up agitation yesterday. While she taking agitation, husband absconding with second wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X