కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వల్ల పరువు పోతోందన్న చిరు, పులివెందులలో ఉద్రిక్తం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల మన పరువు పోతోందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సోమవారం ఎర్రగుంటలోని తన ప్రచారంలో జగన్‌పై విరుచుకు పడ్డారు. జగన్ మరో హసన్ అలీ కాక తప్పదని అన్నారు. 2జి స్పెక్ట్రం కేసులో రాజాలాగే జగన్‌కు కూడా ఇబ్బందులు తప్పవని అన్నారు. జగన్ అవినీతే అతనిని కబలిస్తుందని చెప్పారు. కడప నుండి డిఎల్ రవీంద్రారెడ్డి, పులివెందుల నుండి వైయస్ వివేకానందరెడ్డి గెలుపొందడం ఖాయమని అన్నారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో చిరంజీవికి అనూహ్య స్పందన రావడం విశేషం.

కాగా పులివెందుల నియోజకవర్గంలోని ఓ గ్రామంలో కాంగ్రెసు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వ్యక్తి కాంగ్రెసు వారిపై దుర్భాషాలాడినట్లుగా తెలుస్తోంది. దీనికి కాంగ్రెసు కూడా ఘాటుగానే స్పందించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు.

English summary
PRP president Chiranjeevi blamed Ex MP YS Jaganmohan Reddy today in his campaign. He compared YS Jagan as Hasan Ali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X