హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రయాంగిల్ లవ్ స్టోరీ: చెల్లెలిపై అక్క యాసిడ్ దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజమండ్రిలోమండపేట మండలంలో చెల్లెలి, మరిదిపై ఓ అక్క యాసిడ్ పోసిన దాడి సంఘటన చోటు చేసుకుంది. అక్క యాసిడ్ దాడిలో ఆమె తల్లి కూడా గాయపడింది. వీరు ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వివరాలలోకి వస్తే లవకుమార్ అనే యువకుడు వరలక్ష్మి అనే అమ్మాయి ప్రేమించుకున్నారు. వారు ఇటీవలె పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని వరలక్ష్మి అక్క వారిపై ఆదివారం యాసిడ్‌తో దాడి చేసింది. అడ్డుకోవడానికి వచ్చిన ఆమె తల్పిపై కూడా యాసిడ్ పడి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే చెల్లెలిని పెళ్లి చేసుకున్న లవకుమార్‌తో అక్కకు ఇంతకుముందే సంబంధం ఉందని తెలుస్తోంది. తనను మోసం లవకుమార్ మోసం చేశాడని ఇప్పుడు తన చెల్లెలిని మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లుగా అక్క ఆరోపిస్తుంది. అయితే యాసిడ్ దాడి చేసిన అక్కను తీవ్రంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. దాడిలో గాయపడ్డ లవకుమార్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక అలమూరులో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని యాసిడ్ పోసి చంపారు. ఇది శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరణించిన వ్యక్తి మొహం, మర్మాంగాలపై యాసిడ్ పోసి చంపారు. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరూ అనేది ఇప్పటి వరకు గుర్తించలేదు. ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో పోలీసులు ఆ శవాన్ని గుర్తించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తన కొడుకును మందలించిందన్న కారణంతో మహిళను ఓ వ్యక్తి కాల్చి చంపాడు.

English summary
Sister attacked with acid on her son-in-law Lava Kumar and his sister Varalaxmi today in Rajahmundry. They are newly married.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X