వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణాచల్ ప్రదేశ్ సిఎం దోర్జీ ఖండు మృతి, హెలికాప్టర్ శకలాలు లభ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Dorjee Khandu
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండుతో పాటు మరో నలుగురు మృతి చెందారు. ఖండు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ శనివారం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్ కూలిపోవడంతో ఖండు, మరో నలుగురు మరణించారు. అధికారులు దోర్జీ మృతదేహాన్ని కనుక్కున్నారు. శవాలు కుళ్లిపోయి కనిపించాయి. నాలుగు సీట్ల సింగిల్ ఇంజన్ పవన్ హన్స్ హెలికాప్టర్ తవంగ్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకే ఆచూకీ లేకుండా పోయింది.

ఖండుతో పాటు పైలట్లు కెప్టెన్ జెఎస్ బబ్బర్, కెప్టెన్ టిఎస్ మామిక్, ఖండు భద్రతాధికారి యేశి చోడ్డక్, యేషీ లామూ, తవంగ్ ఎమ్మెల్యే సోదరి సెవాగ్ దోందుప్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్ శనివారంనాడు 13,700 అడుగుల ఎత్తున భూటాన్ సరిహద్దుల్లోని సెలా పాస్ వద్ద ఉన్నప్పుడు చివరి సంకేతాలను అందించింది. భూటాన్ సరిహద్దుల్లో హెలికాప్టర్ కిందికి వచ్చినట్లు తెలుస్తోంది.

విపరీతమైన మంచు, భారీ వర్షం వల్ల ఖండు కోసం ప్రారంభించిన వేట మంగళవారం ముందుకు సాగలేదు. సంఘటనా స్థలానికి సహాయ బృందాలు చేరుకోవడానికి ప్రత్యేకమైన తాళ్లను తెప్పిస్తున్నట్లు సమాచారం. వాతావరణం సరిగా లేకపోవడంతో భారత వైమానిక దళం ఆదివారం అన్వేషనను ఆపేసింది. మళ్లీ సోమవారం వేట ప్రారంభించింది.

English summary
The wreckage of the helicopter carrying Arunachal Pradesh Chief Minister Dorjee Khandu and four others, that went missing on Saturday last, has been located. Mr Khandu and all others on the helicopter have died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X