వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడు మోసం చేశాడని పోలీసులు స్టేషన్ ఎదుట నర్స్ ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: ప్రియుడు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదని, తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఓ నర్స్ విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకుంది. విశాఖపట్నంలోని మాడుగుల పోలీసు స్టేషన్ ఎదుట ఆమె పురుగుల మందు తాగి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగిన ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనిపై ఆగ్రహించిన గ్రామప్రజలు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు సిద్ధపడ్డారు.

ఇంటర్మీడియట్ పూర్తి చేసి వ్యవసాయం చేసుకుంటున్న సత్యనారాయణ అనే యువకుడు తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని దుంగ లక్ష్మి అనే నర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా ఆమె మాడుగుల పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. అయితే సత్యనారాయణకు కౌన్సెలింగ్ చేస్తున్నామని చెబుతూ వచ్చారు. బుధవారం కూడా సత్యనారాయణను పోలీసులు పిలిపించి మాట్లాడారు. తనపై కేసు నమోదు చేసుకోవచ్చునని, తాను మాత్రం దుంగ లక్ష్మిని పెళ్లిని చేసుకోనని కచ్చితంగా చెప్పాడు.

సత్యనారాయణ పెళ్లికి నిరాకరించడంతో కేసు పెట్టేందుకు పోలీసులు సిద్ధపడ్డారు. ఫిర్యాదుపై సంతకం చేయాలని పోలీసులు దుంగ లక్ష్మికి చెప్పారు. తనకు పెళ్లి కావాల్సిందేనని చెబుతూ ఆమె ఆత్మహత్య చేసుకుంది. దుంగ లక్ష్మి నర్సింగ్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తోంది.

English summary
A nurse, Dunga Laxmi committed suicide at Madugula police station of Vishakapatnam, as her lover rejected to marry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X