వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజాదే 2జి పాపం: కరుణ కుమార్తెగా పుట్టడమే తన పాపమన్న కనిమొళి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kanimozhi
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కూతురుగా పుట్టడమే తాను చేసిన పాపమని డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళి శుక్రవారం వాపోయారు. 2జి కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదని ఆమె చెప్పుకొచ్చారు. అనవసరంగా తనను ఇరికించారని అన్నారు. కుంభకోణంలో ప్రధాన సూత్రధారి రాజాయేనని కనిమొళి చెప్పారు. అయితే ఆమె వాదనలో బలం లేదని స్పెషల్ కోర్టు పేర్కొంది. ఆమె వాదనలో బలం లేదని కోర్టు చెప్పిన దృష్ట్యా ఆమె అరెస్టు ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా, కనిమొళి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఢిల్లీకోర్టు రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు కనిమొళి 2జి కుంభకోణం కేసులో ఢిల్లీ సిబిఐ కోర్టు ముందు హాజరయింది. కనిమొళి తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ కనిమొళికి కుంభకోణంలో పాత్ర లేదని వాదించారు. కేవలం ఆమె కలైంగ్ఞర్ టీవిలో వాటా దారు మాత్రమే అని అన్నారు. అయితే కనిమొళి వాదన సరిగా లేదని తేల్చి చెప్పింది.

English summary
DMK MP Kanimozhi said that she was not interfeared in 2G spectrum. She blamed Raja for 2G scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X