సత్యసాయి ట్రస్టు చెక్ పవర్ ముగ్గురికి, ఇధ్దరు సంతకాలు చేస్తే ఓకే
అయితే సత్యసాయి దశదిన కర్మ పూర్తయిన తర్వాతే ట్రస్ట్ సమావేశం నిర్వహించి వీటిపై నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో సభ్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, సాయి కుల్వంత్ హాల్లో బుధవారం జరిగిన సత్యసాయి ఆరాధనోత్సవాల్లో ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ మాట్లాడుతూ ట్రస్ట్ వ్యవస్థాపకులైన సత్యసాయే దానికి శాశ్వత చైర్మన్గా కొనసాగుతారని ప్రకటించారు. జస్టిస్ పీఎన్ భగవతి అధ్యక్షతన ట్రస్ట్ సభ్యులు ఇందూలాల్ షా, ఆర్జే రత్నాకర్, వి.శ్రీనివాసన్, ఎస్వి గిరి గురువారం ప్రశాంతి నిలయంలో సమావేశమయ్యారు. ఏకగ్రీవంగా పలు తీర్మానాలు చేశారు.
ట్రస్ట్ వ్యవహారాలను నడిపేందుకు జస్టిస్ భగవతి అధ్యక్షతన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సత్యసాయి చేపట్టిన ఉచిత విద్య, వైద్యం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పారదర్శకంగా వ్యవహరించేందుకే ముగ్గురికి చెక్ పవర్ ఇవ్వాలంటూ ట్రస్ట్ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.